Posted on 2026-03-04 16:19:10
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కెన్నెడీ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీని 9వ తరగతి విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పదవ తరగతి విద్యార్థులు, 9వ తరగతి విద్యార్థులు కలిసి ఆనందంగా పాల్గొన్నారు. పాటలు, డాన్సులతో విద్యార్థులు కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా మార్చారు. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ప్రతిభ చాటాలని ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సురేష్ డేనియల్ మాట్లాడుతూ, పదవ తరగతి విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేయాలని సూచించారు. వారిలో నూతనోత్సాహాన్ని నింపుతూ, పదవ తరగతి పరీక్షల్లో పదికి పది మార్కులు సాధించేలా కట్టుదిట్టంగా సిద్ధం కావాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పలువురు విశాలమైన వాతావరణంలో ఇలాంటి అంగుహార్ బాటలు లేకుండా ప్రకృతి లో నిర్వహించిన విధంగా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
నేరెళ్ల పీహెచ్సీని సందర్శించిన డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పవిత్ర
Posted On 2026-06-22 18:54:32
Readmore >
మత్తు వదలండి… మైదానాలు చేరండి”: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-22 16:16:28
Readmore >
తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్
Posted On 2026-06-21 20:15:20
Readmore >
పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!
Posted On 2026-06-21 19:11:56
Readmore >
బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:40:16
Readmore >