| Daily భారత్
Logo




కరకగూడెం మండలం అశ్వాపురం పాడు గ్రామంలో వ్యక్తి దారుణ హత్య పలువురు అరెస్ట్

News

Posted on 2026-03-05 17:29:32

Share: Share


కరకగూడెం మండలం అశ్వాపురం పాడు గ్రామంలో వ్యక్తి దారుణ హత్య పలువురు అరెస్ట్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం  మండలం లోని  అశ్వాపురం పాడు గ్రామములో అర్ధ రాత్రి జరిగిన హత్య నేరస్థులను  రిమాండ్ పంపడం జరిగింది. పట్టుబడిన వ్యక్తుల వివరాలు  వజ్జ భీమరాజు , మడివి మంగయ్య  ,మడివి నందయ్య , వంకా బాలాజీ ,. మడకం లక్ష్మయ్య ,  ముగ్గురికి మరియు హత్యకు గురి అయిన కొవ్వాసి వెంకటేశ్వర్లు కి మద్య గత కొంత కాలముగా ఊరిలో గొడవలు జరుగుతున్నాయి మొదటి వ్యక్తి అయిన భీమరాజు కొన్ని రోజులు క్రితం ఫారెస్టు వారితో ఘర్షణ కాగా అ కేసులో అతను అతని భార్య ఇద్దరు భద్రాచలం జైలుకు వెళ్లారు అప్పుడు చనిపోయిన వ్యక్తి బీమరాజు కి మరియు అతని భార్య కు బెయిలు పెట్టకుండా అడ్డుకొని భీమరాజు భార్యకి మూడవ వ్యక్తి బెయిలు పెట్టినంధుకు అతని ఊరి నుండి వెల్లగొడతా అని బెదిరించటం అలాగే రెండవ వ్యక్తి కుటుంబ విషయములో తలధూర్చీ అతనని అతని భార్యని విడగొట్టి అంతే కాకుండా భార్యను కూడా ఇతని నుండి విడగొట్టి పంపాలని చనిపోయిన వ్యక్తి చూస్తున్నాడు అని బావించి ఈ ముగ్గురు వ్యక్తులును చనిపోయిన వ్యక్తి ఏదో రకముగా  ఇబ్బంధి పెడుతున్నాడు అని అతని అడ్డు తొలగించుకుందామని మొదటి వ్యక్తి అయిన బీమరాజు  జైలుకి వెళ్ళినప్పుడు అతనికి జైలు లో పరిచయం అయిన బాలాజీ కి వీరి ముగ్గురు కొంత డబ్బు పోగు చేసి అతనికి 50 వేల రూపాయలు ఇస్తాము వెంకటేశ్వర్లు ను చంపటానికి అతని సహయం కావాలని  చెప్పగా అతను ఒప్పుకోని అతను అతని స్నేహితుడు అయిన ఐదవ వ్యక్తి మడకం లక్ష్మయ్య ను తీసుకొని అశ్వాపురం పాడు కి వచ్చి  అంధరు కలిసి పథకం ప్రకారం పడుకొని ఉన్న వెంకటేశ్వర్లు  రాత్రి  గొడ్డలితో నరికి చంపినారు అ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోగా  ఈ ఐదుగురు వ్యక్తులను  ఏడూళ్ళ బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ వెంకటేశ్వర్లుఅరెస్టు చేసి అ ఐదుగురు వద్ద  నుండి అతని చంపటానికి వాడిన గొడ్డలిని అతని చంపినప్పుడు రక్తపు మరకలు అంటిన బట్టలను మరియు బాలాజీ లక్ష్మయ్య అశ్వాపురం పాడు  రావటానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ ను  స్వాధీన పరుచుకొని  రిమాండ్ కి తరలించినారు  ఈ కార్యక్రములో స్థానిక ఎస్సై పివిఎన్ రావు , పి సురేష్,  ఏడూళ్ళ బయ్యారం  సిబ్బంధి ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు

Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 07:51:52

Readmore >
Image 1

ఆటో కార్మికులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-08-15 07:33:17

Readmore >
Image 1

డీఐజీలమంటూ ఫేక్ ఐడీలు... భార్యాభర్తల లక్షల మోసం...

Posted On 2026-08-15 06:37:39

Readmore >
Image 1

భూ వివాదం నేపథ్యంలో వ్యక్తిపై పారతో దాడి.. ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-15 03:41:51

Readmore >
Image 1

"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"

Posted On 2026-08-14 18:18:19

Readmore >
Image 1

కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు

Posted On 2026-08-14 18:10:20

Readmore >
Image 1

ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కుపోగుల చోరీ కేసు ఛేదన

Posted On 2026-08-14 18:08:46

Readmore >
Image 1

ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం

Posted On 2026-08-14 18:05:57

Readmore >
Image 1

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు

Posted On 2026-08-14 18:03:54

Readmore >
Image 1

ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!

Posted On 2026-08-14 09:52:38

Readmore >