Posted on 2026-03-06 19:58:51
ఈ నెల 6 వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు షెడ్యూల్ విడుదల.
డైలీ భారత్, సిరిసిల్ల: “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” 99 రోజుల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాల మేరకు ప్రత్యేక వైద్య నిపుణుల సేవలు వినియోగించు కోవాలని
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. ఎస్ రజిత తెలిపారు. అన్ని వయసుల వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. నిర్దేశిత రోజులలో నాలుగు దశలలో నిర్వహిస్తామని వివరించారు. మొదటి దశలో మార్చి 6 నుండి మార్చి 31 వరకు గర్భిణీలు, వృద్ధులకు రక్తహీనత నిర్ధారణ పరీక్షలు తెలంగాణ డయాగ్నొస్టిక్స్ సెంటర్ ద్వారా ఆరోగ్య సేవలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు, ఆర్ బీ ఎస్ కే బృందాలు, ఇతర వైద్య సిబ్బందికి గర్భిణీ స్త్రీలకు , తల్లులకు అందవలసిన పోషకాహారము, వ్యాధినిరోధక టీకాలపై అవగాహన కల్పించడంతోపాటు గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్లపై ఆరోగ్య పరీక్షలు ప్రత్యేక వైద్య నిపుణుల ప్రసూతి స్త్రీ రోగనిపుణులు, పిల్లల వైద్య నిపుణులు, నేత్ర, కీళ్ల ఎముకల, దంత వైద్య నిపుణులతో పాటు జనరల్ మెడిసిన్ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీన గర్భాశయ క్యాన్సర్ రాకుండా స్త్రీలకు హెచ్ పీవీ వ్యాక్సిన్ ఇస్తామని పేర్కొన్నారు.
ప్రత్యేక వైద్య నిపుణులతో
ఈ తేదీల్లో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ఈ నెల (మార్చి )
7వ తేదీన హనుమాజిపేట,
9వ తేదీన కోనరావుపేట,
10 వ తేదీన లింగన్నపేట,
11 వ తేదీన పోతుగల్,
12 వ తేదీన విలాసాగర్,
13 వ తేదీన ఎల్లారెడ్డిపేట,
14 వ తేదీన పెద్దలింగాపూర్,
16 వ తేదీన నేరెళ్ల,
17 వ తేదీన తంగళ్ళపల్లి,
18 వ తేదీన కొదురుపాక,
20 వ తేదీన సిరిసిల్లలోని సుందరయ్య నగర్ అర్బన్ హెల్త్ సెంటర్,
23 వ తేదీన సిరిసిల్లలోని అంబేద్కర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ నగర్,
24వ తేదీన చీర్లవంచ,
25 వ తేదీన బోయినపల్లి, 26 వ తేదీన కోనరావుపేట,28 వ తేదీన పోతుగల్,
30 వ తేదీన విలాసాగర్,
ఈ నెల (మార్చి) 31 వ తేదీన సిరిసిల్లలోని సుందరయ్య నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ లో ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్య ఆరోగ్య శిబిరాలు, పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత తెలిపారు.
కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి
Posted On 2026-06-23 12:14:31
Readmore >
నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం
Posted On 2026-06-23 11:59:52
Readmore >
ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-23 11:09:19
Readmore >
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >