Posted on 2026-03-06 20:36:31
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలం, మాచినేనిపేట గ్రామానికి చెందిన ఘనప నరసింహారావు, మరియు జూలూరుపాడు చెందిన కోమ్మినేని నాగేశ్వరరావు, గత కొంత కాలం నుండి జూలూరుపాడు మండల పరిసర ప్రాంత లబ్ధిదారుల వద్ద నుండి తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయబడుతున్న రేషన్ బియ్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేసుకుని, మాచినపేట గ్రామ శివారుణ గల నరసింహారావు కోళ్ల ఫారం అక్రమంగా నిలువ చేసుకొని, వాటిని అవసరమైన వారికి అమ్మి, ఎక్కువ మొత్తంలో లాభాలు గడిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో రేషన్ బియ్యాన్ని కోళ్ల ఫారం డంపు చేసుకుని ఉన్నారనే సమాచారంపై , జూలూరుపాడు సిఐ శ్రీలక్ష్మి సిబ్బందితో కలిసి, కోళ్ల ఫారం వద్దకు వెళ్లి 23 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, బజాజ్ ప్లాటినా ద్విచక్ర వాహనమును,ఒప్పో కంపెనీ సెల్ ఫోన్ ను స్వాధీనపరచుకున్నారు. 23 క్వింటాళ్ల రేషన్ బియ్యం విలువ 51 వేల రూపాయలుగా ఉంటుంది. ఇరువురిపై కేసు నమోదు చేయడం జరిగినది. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >
కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి
Posted On 2026-06-23 12:14:31
Readmore >
నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం
Posted On 2026-06-23 11:59:52
Readmore >
ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-23 11:09:19
Readmore >
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >