Posted on 2026-03-06 23:23:50
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి అవసరమైన AC 2.0 GH స్థలం కేటాయించాలంటూ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి స్వంత కార్యాలయం లేకపోవడం వల్ల పార్టీ కార్యకలాపాలు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం నిర్మించేందుకు దాదాపు AC 2.0 GH స్థలం అవసరమని పేర్కొన్నారు.
అందువల్ల ఈ విషయాన్ని సానుకూలంగా పరిశీలించి, కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి అవసరమైన AC 2.0 GH స్థలాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్ ని వినతి పత్రం ద్వారా కోరారు.
ఈ చర్యతో జిల్లాలో పార్టీ కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి వీలవుతుందని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >