Posted on 2026-03-10 18:48:11
డైలీ భారత్, కామారెడ్డి: మాజీ జెడ్పిటిసి, పోసానిపేట వాస్తవ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన సీనియర్ నాయకులు నారెడ్డి మోహన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత బాధాకరమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ దురదృష్టకర వార్త తెలిసిన వెంటనే షబ్బీర్ అలీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మోహన్ రెడ్డి తో ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, పార్టీకి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.
"మోహన్ రెడ్డి గారి మరణం కాంగ్రెస్ పార్టీకి, వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. నిరంతరం ప్రజల కోసం పరితపించే గొప్ప నాయకుడిని మనం కోల్పోయాము. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను
మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో దైవం ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >