Posted on 2026-03-18 18:03:33
ప్రాజెక్టు పై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం విడాలి
నాణ్యత లేకుండా నిర్మించిన రింగు బండ ఎంత కాలం ఉంటుందో తెల్వదు...
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్ట్ ని సందర్శించిన బిజెపి నాయకులు,వారు మాట్లాడుతూ పెద్ద వాగు ప్రాజెక్టు కట్ట తెగి 2 సంవత్సరాలు కావస్తున్న కూడా ఇప్పటివరకు ప్రాజెక్టుని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్నది లేదు,వరద బాధిత రైతులకు ఇప్పటి వరకు సరైన న్యాయం జరిగింది లేదు,ప్రాజెక్టు ని పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కి రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెపుతారని,అధికారులు ధనం దుర్వినియోగం చేస్తూ నాణ్యత పాటించకుండా నిర్మించిన రింగు బండ కూడా రానున్న రోజుల్లో కొట్టుకుపోయే పరిస్థితిలో ఉన్నది,చెరువు మీద ఆధారపడి ఉన్న మత్స్యకారులకు ప్రభుత్వం తరఫున ఇప్పటి వరకు ఎలాంటి భోరోసా లేదు...వర్షాకాలం సమీపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని కట్ట నిర్మించాలని, స్పందన లేని యడల బాధిత రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలిపారు,ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గ బిజెపి నాయకులు తంబళ్ల రవి,సీనియర్ నాయకులు గూడా ముత్యాలరావు,కారం రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >