Posted on 2026-03-18 18:43:40
గంభీరావుపేట సీహెచ్ సీని పరిశీలించిన కలెక్టర్.
డైలీ భారత్, గంభీరావుపేట : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) లో కలెక్టర్ బుధవారం పరిశీలించారు. పలువురు రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో ఏ ఏ సేవలు అందుబాటులో ఉన్నాయో వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ పేషెంట్ వార్డులు, మందులు ఇచ్చే గది, స్టోర్ రూమ్, వ్యాక్సినేషన్ గది, ఎక్స్ రే గది, యునాని హాస్పిటల్, ఆసుపత్రి ఆవరణ అంతా పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణ శుభ్రంగా ఉండాలని ఎంపీడీఓకు సూచించారు. ఆసుపత్రిలో అవసరమైన మరమ్మత్తు పనులు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ కుమార్, జిల్లా వైద్య అధికారి రజిత, డీసీ హెచ్ ఎస్ రవీందర్, సర్పంచ్ మల్లుగారి పద్మ, తహసీల్దార్ మారుతి రెడ్డి, ఎంపీడీవో రాజేందర్, డాక్టర్ సృజన్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >