Posted on 2026-03-18 18:48:12
డైలీ భారత్ హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్ వేదికగా ఇటీవల ముగిసిన 2వ ఆల్ ఇండియా పోలీస్ కబడ్డీ క్లస్టర్ (2025-2026) క్రీడా పోటీల్లో తెలంగాణ పోలీస్ క్రీడాకారులు ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో రాష్ట్ర పోలీసుల కీర్తిని చాటారు. పతకాలతో తిరిగి వచ్చిన క్రీడాకారులను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి తన కార్యాలయంలో అభినందించారు.
ఈ పోటీల్లో పురుషుల ఖో-ఖో విభాగంలో తెలంగాణ జట్టు పట్టుదల ప్రదర్శించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. వివిధ విభాగాలకు చెందిన 15 మంది క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని చాటి ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఇన్ స్పెక్టర్లు బి. శ్రీనివాస్, ఎస్. మట్టం రాజు (సైబర్ క్రైమ్), ఆర్ఎస్ఐ ఎ. రమేష్, వనస్థలిపురం పీఎస్కు చెందిన పి. రంజిత్ కుమార్ కోచ్, కెప్టెన్లుగా వ్యవహరించగా, వివిధ టీజీఎస్పీ బెటాలియన్లకు చెందిన కానిస్టేబుళ్లు జట్టు గెలుపులో తమ వంతు సహకారాన్ని అందించారు.
అలాగే మహిళల ఫెన్సింగ్ విభాగంలో భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ షేక్ ఫౌజియా అసాధారణ ప్రదర్శన చేశారు. ఫైనల్ వరకు దూసుకెళ్లిన ఆమె, హోరాహోరీ పోరులో రజత పతకాన్ని సాధించి రాష్ట్ర పోలీస్ శాఖకు పేరు తెచ్చారు. ఆమెకు శిక్షణ ఇచ్చిన ఎన్.ఐ.ఎస్ ఫెన్సింగ్ కోచ్ ఎస్.ఆర్. అర్జున్ ఆనంద్ కృషిని కూడా డిజిపి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఐ జి పి డా. గజరావు భూపాల్, స్పోర్ట్స్ ఆఫీసర్ డా. ఆర్.వి. రామారావు తదితరులు పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >