Posted on 2026-03-26 19:16:04
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండల నాయకులు కాకర్ల గ్రామానికి చెందిన చెంగల గురునాధం ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని కాకర్ల గ్రామానికి విచ్చేసి సందర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.కుటుంబానికి ఎం ఆర్ పి ఎస్ అండగా ఉంటుందని హామి ఇచ్చి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్ తొలి తరం నాయకులు మండలంలో ఉద్యమాన్ని నడిపించిన మోదుగు ఆదాం,ప్రభాకర్, వేల్పుల నరసింహరావు,మిరియాల ఫ్రాన్సిస్, కిన్నెర దేవయ్య తో పాటు ఎం ఆర్ పి ఎస్ నాయకులు కొత్తపల్లి సోమయ్య,ఏపూరి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు తగరం వెంకట నరసింహారావు, మండల అధ్యక్షులు దెబ్బెందుల సాయి కుమార్, వేల్పుల భాస్కర్, ఖమ్మం జిల్లా నాయకులు తూరుగంటి అంజయ్య,దేపంగి రమణయ్య, మంద కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >