Posted on 2026-03-30 20:25:30
బాధితురాలికి న్యాయం, పోలీసుల కృషికి ఎస్పీ ప్రశంసలు
డైలీ భారత్, మహబూబ్నగర్ :మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో సోమవారం గౌరవ న్యాయస్థానం తుదితీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడికి జీవిత ఖైదు శిక్షతో పాటు జరిమానా విధించగా, ఇతర ఇద్దరు నిందితులకు కూడా కఠిన కారాగార శిక్షలు విధించబడినవి. అదేవిధంగా బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం మంజూరు చేయబడింది.
ఈ కేసును మహబూబ్నగర్ పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి తమన్ రాజరాజేశ్వరి విచారించి శిక్షను ఖరారు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్, ఈ కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన అధికారులందరినీ పేరుపేరునా అభినందించారు.
ప్రాథమిక దర్యాప్తు నిర్వహించిన సిఐ వీరస్వామి, ప్రస్తుతం జడ్చర్ల ఎస్హెచ్ఓగా విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ కమలాకర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.జాన్, అలాగే కోర్టు లైజన్ అధికారులు ఏఎస్ఐ బాలకృష్ణ, పీసీ శంకర్, పీసీ రహీమ్, పీసీ కృష్ణయ్య, సీడీవో హెచ్సీ రాములు మరియు సమన్లు అందజేసిన పీసీ ఏ. యాదయ్య లని ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ కేసులో పోలీసుల సమన్వయంతో సమర్థవంతమైన దర్యాప్తు, కోర్టులో పటిష్టమైన సాక్ష్యాధారాల సమర్పణ వల్ల నిందితులకు కఠిన శిక్ష పడిందని ఎస్పీ తెలిపారు.
పిల్లల భద్రతపై పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇలాంటి నేరాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
#MahabubnagarPolice
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >