Posted on 2026-04-20 13:57:43
డైలీ భారత్, మహబూబ్ నగర్: జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ ఆదేశాల మేరకు సోమవారం మహబూబ్నగర్లోని ఎస్.వి.ఎస్ వైద్య కళాశాలలో యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం మహబూబ్నగర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డి.ఎస్.పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ర్యాగింగ్ అనేది చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, వారి విద్యా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ఇటువంటి అనైతిక చర్యలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసాన్ని దెబ్బతీస్తాయని, సమాజంలో వారి ప్రతిష్టను తగ్గిస్తాయని తెలిపారు.
విద్యార్థులు పరస్పరం గౌరవం, సహకారం, స్నేహభావంతో ఉండాలని సూచిస్తూ, కొత్తగా చేరిన విద్యార్థులను ఆత్మీయంగా స్వాగతించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కళాశాలల్లో ఆరోగ్యకరమైన విద్యా వాతావరణం నెలకొల్పడం కోసం ప్రతి విద్యార్థి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్నారు.
ర్యాగింగ్కు సంబంధించి ఏవైనా ఘటనలు గమనించినప్పుడు వెంటనే కాలేజ్ యాజమాన్యం లేదా పోలీసులకు సమాచారం అందించాలని, బాధితులు భయపడకుండా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న యాంటీ-ర్యాగింగ్ చట్టాలు విద్యార్థుల రక్షణ కోసం ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్, సబ్ ఇన్స్పెక్టర్ భూపాల్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
#MahabubnagarPolice #antiragging
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >