Posted on 2026-05-24 07:52:01
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలకు అనుమతి ఇస్తే అధికారులపై చర్యలు
అధికారులు ఎవరినైనా డబ్బులు అడిగితే క్యాంపు కార్యాలయంలో పిర్యాదు చేయవచ్చు
అవినీతి చేయాలనుకునే అధికారులు వేరే చోటకి బదిలీ చేసుకోవచ్చు
ప్రజా ప్రతినిధుల ఒత్తిడికి తలొగితే మీ భవిష్యత్తు నాశనం అవుతుంది
కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ కి చెందిన కమిషనర్, పట్టణ ప్రణాళిక, శానిటైజేషన్, ఇంజనీరింగ్, రెవెన్యూ, వాటర్ వర్క్స్ అన్ని విభాగాల అధికారులతో MLA క్యాంపు కార్యాలయంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ మున్సిపల్ లోని శానిటైజేషన్, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగం అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి అని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలకు అనుమతి ఇస్తే అధికారులపై చర్యలు తప్పవని అదే సమయంలో నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటికి తప్పక అనుమతి ఇవ్వాలని అన్నారు. అధికారులు ఎవరినైనా డబ్బులు అడిగితే క్యాంపు కార్యాలయంలో పిర్యాదు చేస్తారని నా దృష్టికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. అవినీతి చేయాలనుకునే అధికారులు వేరే చోటకి బదిలీ చేసుకోవచ్చు అని అన్నారు. ప్రజా ప్రతినిధుల ఒత్తిడికి తలొగితే మీ భవిష్యత్తు నాశనం అవుతుంది అని అనవసరంగా భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు అని అన్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >