Posted on 2026-06-10 20:53:10
రుద్రంగి మండలం గైదిగుట్ట తండాలో నిర్మాణ పనుల పరిశీలన.
డైలీ భారత్, రుద్రంగి: రుద్రంగి మండలం గైదిగుట్ట తండాలో ట్రైబల్ వెల్ఫేర్ అప్ గ్రేడెడ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (గర్ల్స్) విద్యాలయం భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రుద్రంగి మండలం గైదిగుట్ట తండా ట్రైబల్ వెల్ఫేర్ అప్ గ్రేడెడ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (గర్ల్స్) భవన నిర్మాణ పనులు కొనసాగుతుండగా, బుధవారం జిల్లా కలెక్టర్ తరగతి గదులు, హాస్టల్ భవనం, ఇతర నిర్మాణ పనులను పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం విద్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్, అధికారులు మొక్కలు నాటారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఈ పరిశీలనలో రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సంగీత, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసాచారి, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >