| Daily భారత్
Logo




జిఒ 317 సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు హర్షణీయం : జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్

News

Posted on 2024-02-25 11:20:00

Share: Share


జిఒ 317 సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు హర్షణీయం : జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిఒ 317 ద్వారా అమలు జరిపిన ఉద్యోగుల విభజనలో ఏర్పడిన సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సిఫారసు చేయటం కోసం జిఒ 292 ద్వారా  వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన, శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయటాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ( టిఎస్ యుటిఎఫ్) స్వాగతిస్తున్నది. 

రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 అమలులో భాగంగా ఉద్యోగుల శాశ్వత కెటాయింపు కోసం  గత ప్రభుత్వం 2021 డిసెంబర్ 6 న జిఒ 317 ద్వారా ఏకపక్షంగా విడుదల చేసిన మార్గదర్శకాల కారణంగా పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారు. క్యాడర్ లో జూనియర్ అయినందుకే స్వంత జిల్లాలను వదిలి పరాయి జిల్లాకు కెటాయించబడ్డారు. భార్యా భర్తలను వేర్వేరు జిల్లాలకు కేటాయించారు. పూర్వపు సర్వీసును వదులుకుని అంతర్జిల్లా బదిలీ ద్వారా వచ్చిన భార్యా భర్తలు కూడా తిరిగి వేరు చేయబడ్డారు. నిబంధనల ప్రకారం భార్యాభర్తలను ఒకే జిల్లాకు బదిలీ చేయాల్సి ఉండగా 19 జిల్లాల్లో అనుమతించి 13 జిల్లాలను బ్లాక్ చేశారు. 

స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు, విడిపోయిన భార్యాభర్తలకు న్యాయం చేయాలని కోరుతూ గత రెండు సంవత్సరాలుగా టిఎస్ యుటిఎఫ్, యుయస్పిసి, ఆయా ఫోరమ్ లు నిర్వహించిన ప్రాతినిధ్యాలను గత ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పోరాటాలను నిరంకుశంగా అణచివేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ మానిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధరబాబు గారికి టిఎస్ యుటిఎఫ్ పక్షాన సమస్యను కూలంకషంగా వివరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జిఒ 317 ద్వారా ఉత్పన్నమైన సమస్యలను పరిష్కారం చేస్తామని మానిఫెస్టోలో పేర్కొన్నారు. ఆ మేరకు ఈరోజు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయటం ఒక ముందడుగు. టిఎస్ యుటిఎఫ్ పక్షాన హర్షం ప్రకటిస్తున్నాము.

జిఒ 317 అమలు కారణంగా ఉత్పన్నమైన సమస్యలను ఉపసంఘం అధ్యయనం చేసి సత్వరమే సానుకూల పరిష్కారాలను ప్రభుత్వానికి సిఫారసు చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాము.


పాకాల శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు, 

గుండమనేని మహేందర్ రావు జిల్లా ప్రధాన కార్యదర్శి, 

అంబటి రమేష్, లత 

జిల్లా ఉపాధ్యక్షులు

పర్కాల రవీందర్

జిల్లా కోశాధికారి

వంగ మల్లేశం

జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్

జిల్లా కార్యదర్శులు

మల్లేశం, శివకుమార్, స్వామి, రాజు భాస్కర్,ప్రవీణ్, తిరుపతి, సరిత

Image 1

సామాజిక న్యాయం చెప్పటం కాదు - అమలు చేయాలి

Posted On 2026-04-11 17:27:29

Readmore >
Image 1

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి

Posted On 2026-04-11 17:12:24

Readmore >
Image 1

ప్రజానాట్య మండల రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

Posted On 2026-04-11 16:26:39

Readmore >
Image 1

కేరళ తరహాలో మున్సిపాలిటీల్లో ఉపాధి పనిని ప్రవేశపెట్టాలి

Posted On 2026-04-11 16:25:00

Readmore >
Image 1

గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-04-11 16:20:14

Readmore >
Image 1

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు

Posted On 2026-04-11 16:16:39

Readmore >
Image 1

అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్

Posted On 2026-04-11 16:14:19

Readmore >
Image 1

మహాత్మా జ్యోతిబా పూలె జయంతి ఉత్సవాలలో -టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ

Posted On 2026-04-11 16:12:01

Readmore >
Image 1

సింగర్ మంగ్లీపై కేసు నమోదు

Posted On 2026-04-11 11:02:54

Readmore >
Image 1

కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు

Posted On 2026-04-11 10:47:57

Readmore >