Posted on 2024-09-09 10:55:17
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై ఇవాళ తెలం గాణ హైకోర్టు తీర్పు వెలువ రించనుంది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్లో చేరారు.
అయితే.. పార్టీ ఫిరాయిం పులకు పాల్పడిన ఎమ్మెల్యే లపై అనర్హత వేటు వేయా లంటోంది బీఆర్ఎస్. ఎమ్మె ల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఏప్రిల్ 24న ఎమ్మెల్యేలు కౌశిక్రెడ్డి, వివేకానంద పిటిషన్ దాఖలు చేశారు.
ఇదిలా ఉంటే.. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్రెడ్డి మరో పిటిషన్ వేశారు. ఆగస్టు 7న ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పు రిజర్వ్ చేసింది.
ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పును ప్రకటించనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది...
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >
కేదార్నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >