Posted on 2024-09-11 12:04:28
మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య, మాజీ కౌన్సిలర్ విజయ్ కుమార్ రెడ్డి, జమ్రుద్ ఖాన్, కట్ట వెంకటేష్ ల అభినందనలు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ గా నియమితులైన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య, మాజీ కౌన్సిలర్ విజయ్ కుమార్ రెడ్డి, జమ్రుద్ ఖాన్, కట్ట వెంకటేష్, అంజద్ గొరి, రఘుమా రెడ్డి, వీర్లపల్లి అన్వర్, కృష్ణారెడ్డి, అలిమ్,జగదీశ్వర్ ముదిరాజ్ తదితరులు పెద్ద ఎత్తున గజమాల, శాలువా వేసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు బిడ్డ, విద్యావంతుడు, సౌమ్యుడు, ఎల్లవేళలా షాద్ నగర్ నియోజకవర్గం ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించే ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను ప్రభుత్వం గౌరవప్రదమైన ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ గా నియమించడం అభినందనీయమన్నారు. జనం మెచ్చిన, నచ్చిన నేతను నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పిలిస్తే పలికే నేత శంకరన్న భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు..
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >