Posted on 2025-07-09 11:35:55
పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని పలువురికి CMRF చెక్కులు అందజేత..
ఏడాది కాలంలో వెయ్యి కోట్లకు పైగా నిధులు CMRF కొరకు వెచ్చించిన ఘనత రేవంత్ అన్న ఆధ్వర్యంలోనీ కాంగ్రెస్ సర్కార్ ది - నీలం..
డైలీ భారత్, హైదరాబాద్: పేదలకు సీఎం సహాయనిధి ఆపత్కాలంలో అండగా నిలిచి ఆదుకుంటుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
మంగళవారం పటాన్ చెరు నియోజకవర్గానికి చెందిన నలుగురు లబ్ధిదారులు గుమ్మడిదల మున్సిపాలిటీ, మండలం - కానుకుంట - ఎల్లబోయిన రాములు (₹1,04,000/-), అన్నారం - చింతగడ్డి సువర్ణ (55,000/-), మంబాపూర్ - కంజర్ల శ్రీనివాస్ (60,000/-) పటాన్ చెరు మండలం రుద్రారం - పి. శమంతా 1,09,000/- మొత్తం ₹3,28,000/- విలువగల సీఎం రిలీఫ్ ఫండ్(CMRF) చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని, అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు CMRF ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తు వెయ్యి కోట్లకు పైగా నిధులను CMRF కొరకు వెచ్చించదని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >