Posted on 2025-07-09 15:55:22
హోటల్ మేనేజ్మెంట్ చేరిన వారు కెరీర్ పై దృష్టి పెట్టాలి..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం విష్ణుమ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ను ప్రముఖ ఫోక్ డాన్సర్ జాహ్నలిరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరాల రత్నాకర్ లు ఘనంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కాలేజ్ విద్యార్థులతో ఆమె ఫోక్ డాన్స్ చేసి అందరిని అలరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరే విద్యార్థులు మంచి భవిష్యత్తుతో ఉన్నత శిఖరాలకు చేరుకొని తమ తల్లిదండ్రులకు, హోటల్ మేనేజ్మెంట్ పేరు నిలబెట్టాలని ఆమె ఆకాంక్షించారు. వివిధ విద్య చేరుతూ పై స్థాయికి వస్తున్నప్పటికీ కూడా హోటల్ మేనేజ్మెంట్ కోర్సును కూడా ఎంచుకొని విజయవంతంగా కోర్సును పూర్తి చేయాలని అలాగే విదేశాలలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకోవాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరాల రత్నాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఇంటర్, డిగ్రీ ల తో పాటు హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ పిల్లలు చేరడానికి ఆసక్తి చూపడం కొత్త ఉరవడికి నాంది అని అన్నారు. ఈ హోటల్ మేనేజ్మెంట్ ఫౌండర్, చైర్మన్ ఈశ్వర్, ఇంచార్జ్ సిహెచ్ శ్రీకాంత్ లకు హోటల్ మేనేజ్మెంట్ అనుభవం ఉందని అన్నారు ఇందులో చదివిన వారికి నూటికి నూరు శాతం ఉద్యోగాలతో పాటు ప్లేస్మెంట్స్ ఇంటర్సిప్స్ వసతులు కల్పించడంతోపాటు, యూరప్, అబ్రాడ్, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తమకు చెప్పడం జరిగిందని ఆయన అన్నారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >