Posted on 2025-07-09 17:58:22
కుటుంబ సభ్యుల ఆందోళన
డైలీ భారత్, తొర్రూరు : అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతూ వృద్ధుడు మృతిచెందిన సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాలు ప్రకారం… నియోజకవర్గంలోని కొడకండ్ల మండలానికి చెందిన పొన్నం పాండురంగ (75) కడుపు నొప్పితో బాధపడుతుండగా సుప్రీత హాస్పిటల్ కు తీసుకొచ్చామని ఆస్పత్రిలో ఇంజక్షన్లు ఇచ్చి స్కానింగ్ తీసుకురమ్మని పంపించగా అక్కడికి వెళ్ళేసరికే మృతి చెందాడని ఆరోపించారు.
తిరిగి మృతుడు పాండురంగ ను హాస్పిటల్ వద్దకు తీసుకువచ్చి బయట పడుకోబెట్టి ఆందోళనకు దిగారు. మృతికి పూర్తిగా కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై ఉపేంద్ర ఆధ్వర్యంలో ఆస్పత్రికి చేరుకొని మృతికి కారణాలను తెలుసుకుంటున్నారు. బాధితులను ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. మృతుడు పాండురంగకు ఇద్దరు కొడుకులు, భార్య ఉన్నారు
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >