Posted on 2025-07-14 21:34:18
డైలీ భారత్, కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం వల్లభపూర్ గ్రామంలో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. కోటగిరి ఎస్సై సునీల్ కథనం ప్రకారం.. వల్లభపూర్ గ్రామానికి చెందిన మేకల హనుమండ్లు (30) అని యువకుడు అప్పుల బాధ భరించలేక ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పురుగుల మందు తాగాడు.
గమనించిన కుటుంబీకులు, స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని దవఖానకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం హనుమండ్లు మృతి చెందాడు. మృతుడి భార్య మేకల గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సునీల్ తెలిపారు
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >