| Daily భారత్
Logo




"మద్యపానం మానసిక సమస్యలను సృష్టిస్తుంది" : సైకాలజిస్ట్ కె. పున్నంచందర్

News

Posted on 2025-07-22 13:01:34

Share: Share


"మద్యపానం మానసిక సమస్యలను సృష్టిస్తుంది" : సైకాలజిస్ట్ కె. పున్నంచందర్

- కార్మికుల మనో వికాస సదస్సులో ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో ఈరోజు పద్మనగర్ లోని కార్మికులకు ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ మద్యపాన వ్యసనం పై మనో వికాస సదస్సును నిర్వహించినారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యపాన వ్యసనం మానసిక సమస్యలను సృష్టిస్తుంది అని అన్నారు. మద్యపానం దీర్ఘః కాలిక మానసిక ఒత్తిడికి గురిచేసి మెదడు, నరాల బలహీనతలు కారణమవుతుందని అన్నారు.

మద్యం ఒక్కసారిగా మానివేస్తే నిద్ర సమస్యలు, కాళ్ళు చేతులు వణుకడం, శరీరం అదుపు తప్పడం, మానసికంగా భ్రమలు బ్రాంతులు ఏర్పడి పిచ్చిగా ప్రవరిస్తారని అన్నారు.

చాలా సార్లు, ఫిట్స్, పక్షవాతం, మెదడులో రక్తం గడ్డ కట్టుట, డిలీరియం లాంటి  సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు.

మద్యం మానుకునేందుకు మైండ్ కేర్ సెంటర్, ప్రభుత్వ సాధారణ వైద్యశాల యందు అధునాతన చికిత్స, కౌన్సిలింగ్ అందుబాటులో ఉందని వివరించారు. తమను ఈ సమయంలోనైనా సంప్రదించవచ్చని తెలిపారు.

అత్యవసర సమయంలో 8801888805 నెంబరు కు ఫోన్ చేసి కౌన్సిలింగ్ పొందవచ్చని అన్నారు.

ఈ సందర్భంగా పున్నంచందర్ మాటడుతూ ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా మనో వికాస కేంద్రానికి వచ్చి పరిష్కరించుకోవాలని కోరారు.

ప్రభుత్వం కార్మికుల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ మహిళా శక్తి చీరల ఆర్డర్లు, నేతన్న భీమ, త్రిఫ్ట్ పథకం, యార్న్ డిపో ఏర్పాటు, యార్న్ సబ్సిడీ పథకాలను ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిందని అన్నారు.


ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ కౌన్సిలింగ్ సెంటర్ సిబ్బంది రాపెల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమ మరియు మర మగ్గాలు వస్త్రోత్పత్తి దారుడు ఏనుగుల మనోజ్, కార్మికులు పాల్గొన్నారు.

Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >