Posted on 2025-08-12 13:31:49
డైలీ భారత్, బోధన్: మండలంలోని అంబం గ్రామ శివారు ఎన్ఎస్ఎఫ్ భూమిలో ఇస్కాన్ టెంపుల్ నిర్మాణానికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇస్కాన్ సంస్థ చేపడుతున్న సామాజిక కార్యక్రమాలను గుర్తించి బోధన్ ప్రాంతంలో ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీకి చెందిన నాలుగు ఎకరాల స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులకు భోజనం, ఉచిత విద్య, వృద్ధాశ్రమం ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరలో భూ కేటాయింపు పత్రాలు అందజేస్తామన్నారు. అనంతరం బోధన్లోని ఉర్దూఘర్ను ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు శ్రీకాంత్, నరసింహారెడ్డి, సుచిత్ర, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హుందాన్, కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్, బిల్లా రామ్మోహన్, ఎల్లయ్య యాదవ్, మల్కా రెడ్డి పాల్గొన్నారు.
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...
Posted On 2026-07-13 13:25:59
Readmore >
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >