Posted on 2025-08-14 15:12:50
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేజీబీవీ, మోడల్ స్కూల్ పిఈటిల సమస్యలు విపులంగా వివరించారు.
ప్రతి ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో పిఈటి పోస్టులు మంజూరు చేయాలని, అలాగే పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే మండల, జిల్లా, రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు రవాణా ఖర్చులు మరియు భోజన సదుపాయాలు కల్పించాలని విప్ ని కోరారు.
ప్రస్తుతం జరగబోయే ఉపాధ్యాయ పదోన్నతల్లో అర్హత కలిగిన వ్యాయామ ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు కల్పించాలని కోరడం జరిగింది
ఈ విషయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, తక్షణ చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు.
ఇట్టి కార్యక్రమంలో టిజిపేట రాజన్న సిరిసిల్ల శాఖ అధ్యక్షులు తడుకల సురేష్ ప్రధాన కార్యదర్శి నాంపల్లి శ్రీనివాస్ అధ్యక్షులు దుప్పటి రవికుమార్ మరియు కార్యవర్గ సభ్యులు నరేష్, పరుశురాములు, శ్యాంసుందర్ మరియు రమేష్ పాల్గొన్నారు
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >