Posted on 2025-08-18 11:45:04
నస్రుల్లాబాద్ మండలం దుర్కి శివారులో దారుణ ఘటన
జాతీయ రహదారిపై ఉన్న పైపులో ఇరుక్కొని వ్యక్తి దుర్మరణం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జాతీయ రహదారిపై కల్వర్టు వద్ద నీరు ప్రవహించేలా ఏర్పాటు చేసిన పైప్ లో ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి శివారులో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్ మండలం దుర్కి శివారులో కల్వర్టు వద్ద చేపలు పట్టేందుకు దేశాయిపేట్ గ్రామానికి చెందిన రాజు(28) వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ రోడ్డు పనుల్లో భాగంగా అమర్చిన పైప్లో రాజు ఇరుక్కున్నాడు. దీంతో బయటపడే అవకాశం లేకపోవడంతో నీట మునిగి మృతి చెంది ఉంటాడని స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >