Posted on 2025-08-22 14:25:30
ముస్తాబాద్ మండల స్థాయి క్రీడా ఉత్సవాలను పోతుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించిన జిల్లా కలెక్టర్
డైలీ భారత్, ముస్తాబాద్: క్రీడా పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముస్తాబాద్ మండల స్థాయి క్రీడా ఉత్సవాలను పోతుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ...
3 రోజుల పాటు ముస్తాబాద్ మండల క్రీడా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, బాలురు, బాలికలకు, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వాలీబాల్ ,కబడ్డీ, కోకో ఇటువంటి క్రీడలు సీనియర్, జూనియర్ లెవెల్ లో జరుగుతున్నాయని అన్నారు.
విద్యార్థులు క్రీడా పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నాలని అన్నారు. క్రీడలు ఆడే విద్యార్థులు అందరికీ షూ అందించాలని కలెక్టర్ అన్నారు. క్రీడా పోటీలు ఎండ తీవ్రత లేని సమయంలో పెట్టాలని, స్కూల్ టైమింగ్ దృష్టిలో పెట్టుకుని సాయంత్రం నాలుగు తర్వాత పెడితే ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొని అవకాశం ఉంటుందని అన్నారు.
క్రీడలు ఆడటం వల్ల పిల్లల మానసిక, శారీరక ఎదుగుదల పెరుగుతుందని అన్నారు. ప్రతిరోజు కొంత సమయం క్రీడలు ఆడటం వల్ల విద్యార్థులు చదువులు కూడా రాణిస్తారని అన్నారు. మండల స్థాయిలో క్రీడా పోటీలకు మంచి ఏర్పాట్లు చేసిన సిబ్బంది ను కలెక్టర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఉపాధ్యాయులు స్థానిక నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >