Posted on 2025-09-02 07:52:24
డైలీ భారత్, హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవ కాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న రుతుపవన ద్రోణి ప్రభావం కూడా ఉన్నట్లు వివరించింది. మంగళ, బుధవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా... ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కుమురంభీం ఆసి ఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
రాష్ట్రంలో ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లిలో 12 సెం.మీ. నమోదైంది.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >