Posted on 2025-09-02 09:32:02
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: రాజకీయ కక్షలో భాగంగానే కాలేశ్వరం ప్రాజెక్టుపై పి వి గోష్ కమిటీని కాదని రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ సిబిఐ ద్వారా దర్యాప్తు చేయడానికి తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు సిర్ప రాజు ఆరోపించారు. రాష్ట్ర కమిటీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆదేశాల ప్రకారం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని ఆ ప్రాజెక్టు ద్వారా వేలాదిమంది రైతులకు సాగునీటి అందుతుందని అప్పటి తమ ముఖ్యమంత్రి కేసీఆర్ సదుద్దేశంతో కాలేశ్వరం ప్రాజెక్టుని నిర్మిస్తే దాన్ని సిబిఐ కి అప్పగించడాన్ని తాము తీవ్రంగా తప్పుపడుతున్నామని ఇది కేవలం బి ఆర్ ఎస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని అందులో ఒక త్రీ బస్సు తప్ప ఏ ఒక్క హామీ ఇప్పటివరకు అమలు చేయలేరని మండిపడ్డారు. రాష్ట్రంలో కుండపోత వర్షాలతో ప్రజలు అల్లారిపోతున్నారని జనజీవనం స్తంభించి పోతుంటే వారికి సహాయం ఆర్థిక సహాయం అందించక కాంగ్రెస్ ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా కాలేశ్వరం ప్రాజెక్టుపై అనవసర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >