Posted on 2025-09-05 16:24:02
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని సర్దార్ నగర్లో శ్రీ గురుకుల ఆశ్రమ సంఘం ఆధ్వర్యంలో 61వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విఘ్నేశ్వర మండపంలో భక్తిశ్రద్ధల మధ్య విఘ్నేశ్వర పూజలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా మండపాన్ని విద్యుద్దీపాల కాంతులతో కళకళలాడేలా ప్రత్యేకంగా అలంకరించడం భక్తుల మనసులను ఆకట్టుకుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఉత్సాహభరితంగా కొనసాగుతుండగా, స్థానిక భక్తజనం తో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.
సంప్రదాయం, ఆధ్యాత్మికత, భక్తి— కలిసిన ఈ పూజా వాతావరణం సిరిసిల్ల పట్టణానికి కొత్త వెలుగులు నింపింది
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >