Posted on 2025-09-07 12:35:18
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ముస్లిం కుటుంబాల్లో నిరుపేద ప్రజలు ఉండకూడనే ప్రధాన లక్ష్యంతో తమ జఖత్ సెంటర్ ఇండియా యొక్క లక్ష్మణ్ అందుకే ఈ సెంటర్ ద్వారా పేద ప్రజలకు తాము సొంత కాళ్లపై నిలబడడానికి చిరు వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వారు ఏ రంగాల్లో స్థిరపడాలనుకున్నారో వస్తువులను ఉచితంగా పంపిణీ చేస్తామని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్ లో జాఖత్ ఇండియా ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం రంజాన్ నుండి తిరిగి వచ్చే రంజాన్ వరకు ముస్లిం మతస్తుల్లో ఉండే ధనవంతుల నుండి తమ ట్రస్టు పేద కుటుంబాలను ఆదుకోవాలని లక్ష్యంతో వారి వద్ద నుండి చందాల రూపంలో డబ్బులు వసూలు చేసి సామాగ్రిని, వ్యాపారాలలో నిలదుక్కుకొని వారికోసం తామే ఆ సామాగ్రిని కొనుగోలు చేసి వారికి స్వయంగా ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ఇందులో భాగంగా చిరు వ్యాపారం చేసుకునే వారికోసం లోన్ సౌకర్యం అందిస్తామన్నారు. ఈ రూపంలో ఈ సంవత్సరం తొమ్మిది లక్షల రూపాయల విలువ గల వస్తువులను నిజామాబాద్ ట్రస్టు ద్వారా పేద ప్రజలకు సామాగ్రిని పంపిణీ చేసినట్లు వారు తెలిపారు అలాగే మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు డబ్బు నగదు పంపిణీ చేస్తే వృధా చేస్తారని లక్ష్యంతో తామే స్వయంగా వారు ఏ రంగాల్లో స్థిరపడాలనుకున్నారో చెబితే ఆ రంగంలో కావాలనుకున్న చిరు సామాగ్రిని తామే అందిస్తామన్నారు. గతంలో 34 లక్షల రూపాయల సామాగ్రిని పేద ముస్లిం ప్రజలకు. ఇందులో భాగంగా ఆదివారం 58 మంది లబ్ధిదారులకు తమ ట్రస్టు ద్వారా నిరుపేద ముస్లిం కుటుంబాలకు లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు వారు వెల్లడించారు. దేశవ్యాప్తంగా తమ ట్రస్ట్ సెంటర్లు 22 బ్రాంచీలు ఉన్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు మహమ్మద్ జాకీర్ హుద్దీన్, అబ్దుల్ రహిమాన్, అబ్దుల్ అలీమ్, గౌస్ పాస తదితరులు పాల్గొన్నారు.
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >