Posted on 2025-09-08 17:55:50
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు భాజపా సీనియర్ నాయకుడు బసవ లక్ష్మీ నరసయ్య కు ఆ పార్టీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇకపై భజప్ప రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీ నరసయ్య కొనసాగుతారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇన్నాళ్లు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న బస్వ లక్ష్మీ నరసయ్య ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా పర్యటనలో భాగంగా అప్పటినుండి చురుకుగా పాల్గొంటున్న నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో నామమాత్రపు అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్లు అతని సన్నిహితులు చర్చించుకుంటున్నారు. ఎప్పటినుండో పార్టీ కోసం పార్టీ అధికారం కోసం తనవంతుగా కృషిచేసిన బసవ లక్ష్మీనరసయ్య గత కొంతకాలంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆయనకు కొన్ని విభేదాలు తలెత్తినట్లు ప్రచారం కొనసాగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకు రాష్ట్రస్థాయిలో ఏ ప్రాధాన్యం లేని రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం పట్ల ఆయన వర్గీయులు ఒకింత నిరాశకు గురవయ్యారు. అలాగే బిజెపిలో చేరిన కొన్ని రోజుల్లోనే బిజెపి మహిళ నేతకు రాష్ట్రస్థాయిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పజెప్పడం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త చర్చకు దారితీసింది.
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >