Posted on 2025-09-08 18:12:51
డైలీ భారత్, హైదరాబాద్:హైదరాబాద్లో భారీ మొత్తంలో నోట్లు పట్టుబడ్డాయి. నారాయణగూడ శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంక్ వద్ద ఇద్దరిని, వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద మరో ఇద్దరిని ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నలుగురి వద్ద ఉన్న 3 బ్యాగుల్లోని రూ.2 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ నోట్లు అన్ని రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు.
మూడు బ్యాగులలో భారీ మొత్తంలో నోట్లు ఉన్నట్లు ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆటో డ్రైవర్ సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు నారాయణగూడలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 3 బ్యాగుల్లో రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం నారాయణగూడ పోలీస్స్టేషన్కు నిందితులను తరలించారు. 2016లో పెద్ద నోట్లు రద్దు కాగా.. 9 ఏళ్ల తర్వాత పట్టుబడడం అందరిని షాక్కు గురిచేసింది. రద్దయిన నోట్లను ఏం చేయడానికి తీసుకెళ్తున్నారు అనే కోణంలో పోలీసులు విచారించనున్నారు.
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >