Posted on 2025-09-09 16:12:14
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ డే కేర్ సెంటర్ ను మంత్రి దామోదర రాజనర్సింహ ఆన్లైన్లో మంగళవారం ప్రారంభించారు. ఈ సెంటర్ ఏర్పాటు లక్ష్యం అన్నారు. క్యాన్సర్ రోగులకు పగటి సమయంలోనే చికిత్స అందించడం. ఇప్పటివరకు ఎంజెఎన్ ఆసుపత్రిలో మొదటి డోస్ చికిత్స పొందిన రోగులు ఇకపై రెండో డోస్ నుండి నిజామాబాద్లోని డే కేర్ సెంటర్లోనే చికిత్స పొందవచ్చనీ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. దీని ద్వారా నిజామాబాద్ పరిసర ప్రాంతాల రోగులకు పెద్ద ఎత్తున ఉపయోగం కలుగుతుంది. హైదరాబాదుకు ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా, స్థానికంగానే సమయానికి చికిత్స పొందే అవకాశం లభిస్తుందనీ పేర్కొన్నారు. అలాగే, క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మందులు డే కేర్ క్యాన్సర్ సెంటర్లో సరఫరా చేయబడి అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >