| Daily భారత్
Logo




జాతీయ లోక్ అదాలత్ కు జిల్లాకు నాలుగవ స్థానం

News

Posted on 2025-09-14 13:27:01

Share: Share


జాతీయ లోక్ అదాలత్ కు జిల్లాకు నాలుగవ స్థానం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెండింగ్ లో ఉన్న కేసులను రాజీ పద్ధతిలో పరిష్కరించినందుకు నిజామాబాద్ జిల్లాకు 4వ స్థానం వచ్చిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు.. ఇందుకు కృషి చేసిన అధికారులకు సిబ్బందికి సీపీ సాయి చైతన్య అభినందనలు తెలిపారు. గత నెల రోజుల నుండి శనివారం జరిగిన జాతీయ మెగా లోక్-అదాలత్ వరకు కేసులలో భాగంగా, జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన, రాజీ పడటానికి అవకాశం ఉన్న చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కేసులు రాజీ పద్ధతిలో పరిష్కరించబడ్డాయన్నారు. ఐ.పి.సి, బి ఎన్ ఎస్ 501 కేసులు, సైబర్ క్రైమ్ 138 కేసులు, ఇ -పెట్టి 1958 కేసులు డి.డి, ఎంవీ యాక్ట్ 4985 కేసులతో కలిపిమొత్తం 7444 కేసులలో ఇరు వర్గాలను రాజీ కుదర్చడం జరిగిందని, ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. జాతీయ మెగా లోక్- అదాలత్ లో భాగంగా నిజామాబాద్ జిల్లా కు సైబర్ క్రైమ్, వివిధ కేసులలో రాజీ మార్గం చేసినందుకు నిజామాబాద్ జిల్లాకు 4వ స్థానం రావడం జరిగిందన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు 42.45.273-00 రూపాయలను ఇప్పించడం జరిగిందన్నారు. జిల్లాను రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా ఉంచడంలో కృషి చేసిన అధికారులు, సైబర్ క్రైమ్ సిబ్బందిని, కోర్టు సిబ్బందిని జిల్లా పోలీస్ కమీషనర్ అభినందించారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని, అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు. రాజీ మార్గమే రాజా మార్గం అని, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులల్లో ఇరు వర్గాలు రాజీపడవచ్చు అన్నారు. ముఖ్యంగా సైబర్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని, తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ఆద్వర్యంలో 7 కమీషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లు, ప్రతి జిల్లాలో డి4సి ని ఏర్పాటు చేసి డి.ఎస్.పి స్థాయి అధికారులచే పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. నిజామాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన సైబర్ నేరాలలో ఈ జాతీయ మెగా లోక్-అదాలత్ లో 138 సైబర్ క్రైమ్ కేసులలో 42,45,273-00 రూపాయలను తిరిగి సైబర్ బాధితులకు ఇప్పించేందుకు ఆర్డర్ కాపీలను సంబంధిత బ్యాంక్ నోడల్ అధికారులకు పంపించడం జరిగిందన్నారు.

జిల్లా ప్రజలెవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే దరఖాస్తు చేయవచ్చు అన్నారు. ఈ సందర్భంగా జాతీయ మెగా లోక్- అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులు సైబర్ క్రైమ్ ఏసీపీ వెబోఫ్ట్వేర్ రావ్, సీఐ ముఖిద్ పాషా, సి సి ఆర్ బి సీఐ సతీష్ సైబర్ సెల్ సిబ్బందిని పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, అభినందించారు.

Image 1

దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

Posted On 2026-07-11 05:32:51

Readmore >
Image 1

కాకినాడలో రూ.98.66 కోట్ల పెట్టుబడి మోసం : ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-11 04:14:53

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >