Posted on 2025-09-26 15:23:18
డైలీ భారత్ న్యూస్, వరంగల్/నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రేలకుంట గ్రామానికి చెందిన అంగోత్ వీరన్న నాయక్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా సాధించినందుకు గాను నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు అంగోత్ ఫుల్ సింగ్ నేతృత్వంలో నిర్వహించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో మాజీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మలోత్ చరణ్ సింగ్, సీనియర్ నాయకులు మలోత్ నముకు నాయక్, జరుపుల రమేష్ నాయక్, రేలకుంట గ్రామ పార్టీ అధ్యక్షుడు రమేష్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.
డాక్టరేట్ సాధన ద్వారా మండలానికి గౌరవం చేకూరిందని అన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో సేవలో నిమగ్నం అవ్వాలని అభినందనలు తెలియజేశారు. అంగోత్ వీరన్న నాయక్ శ్రమ, అంకితభావం అన్ని కార్యకలాపాలకు ప్రేరణగా ఉంటుందని గుర్తుచేశారు.
ఈ ఘన సన్మానం ద్వారా నల్లబెల్లి మండల ప్రజల కోసం విజ్ఞాన, సామాజిక సేవలో మార్గదర్శకత్వం కొనసాగేలా ఉందని నేతలు తెలిపారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్
Posted On 2026-04-10 08:29:28
Readmore >
AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి
Posted On 2026-04-10 08:06:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్
Posted On 2026-04-10 07:32:15
Readmore >
విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-10 07:25:14
Readmore >
ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
Posted On 2026-04-10 06:36:42
Readmore >