Posted on 2025-10-02 18:05:16
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: శ్రీ దేవీశరన్నవరాత్రుల మహర్నవమి సందర్భంగా నగరంలోని శ్రీ వారాహి మాత ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. సాయంత్రం 7.30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక అభిషేకాలు, పుష్పార్చన, మంగళహారతి నిర్వహించగా అనంతరం శ్రీ వారాహి మూల మంత్ర హవనం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక పరవశాన్ని పొందారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ మాట్లాడుతూ, వారాహి అమ్మవారి ఆశీర్వాదం పొందినవారికి జీవితం సాఫల్యం అవుతుందని, నవరాత్రులు భక్తి, శక్తి, జ్ఞానం కలిసే పర్వదినాలు కావడంతో ప్రతి కుటుంబం ఈ సమయాన్ని పవిత్రతతో, సత్సంకల్పాలతో గడపాలని సూచించారు. అలాగే అమ్మవారి కృపతో నిజామాబాద్ మరింత ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతోందని, ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి భక్తుడికి అమ్మవారి దయాభిక్ష లభించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమం అనంతరం భక్తులకు అల్పాహారం విందు చేశారు.
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >