Posted on 2025-10-04 14:17:12
డైలీ భారత్, హైదరాబాద్: సాహితీ కళాసేవ సమితి, హైదరాబాద్ వారు ప్రతి ఏటా రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి విజయదశమి పురస్కారాలు అందిస్తున్నారు. 2025 విజయదశమి పురస్కారాలకు విద్యారంగంలో విశేష సేవలందించి ఎందరో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన పాకాల శంకర్ గౌడ్ ఎంపిక అయ్యారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో కృషిచేసిన 25 మంది కి ఈ సంవత్సరం విజయదశమి పురస్కారాలు అందజేశారు. ప్రస్తుతం
పాకాల శంకర్ గౌడ్ కుసుమరామయ్య బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (భౌతిక శాస్త్రం) గా పని చేస్తున్నారు.
27 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో నిబద్ధతతో పనిచేస్తూ విద్యార్థుల్లో శాస్త్రీయ పరిజ్ఞానం పెంపొందించడానికి నిరంతరం కృషి చేస్తున్న శంకర్ గౌడ్ ను ఈ సంవత్సరం విజయదశమి పురస్కారం వరించింది. వృత్తిలోనే రాణిస్తూ వివిధ సామాజిక అంశాలపై 200కు పైగా ఆర్టికల్స్ ని రాస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు. బతుకమ్మ దసరా సంబరాల్లో భాగంగా తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాదులో సాహితీ కళా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు స్వప్న కిషోర్ గారి చేతుల మీదుగా శంకర్ గౌడ్ ఈ అవార్డును అందుకున్నారు.
శంకర్ గౌడ్ విజయదశమి పురస్కారానికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోతిలాల్, ఉపాధ్యాయ బృందం మరియు టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రవీందర్ , రాజు లు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
శంకర్ గౌడ్ సేవలను గుర్తించి గత ఏడాది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించింది.
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >