Posted on 2025-10-05 09:29:18
ఇరువురికి గాయాలు ఆసుపత్రికి తరలించిన పోలీసులు
డైలీ భారత్, నిజామాబాద్:జిల్లాకేంద్రంలో సమీప బంధువులైన ఇద్దరు యువకుల మధ్య మద్యం తాగిన అనంతరం మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఒకరిపై ఒకరు పరస్పరం దాడులకు పాల్పడగా ఓ యువకుడికి కత్తిపోట్లు కాగా మరో యువకుడు గాయపడ్డాడు. నిజామాబాద్ రూరల్ ఎస్సై మహమ్మద్ ఆరిఫ్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరం లోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన ఆకాశ్, మాణిక్ అనే ఇద్దరు యువ కులు కలిసి శనివారం రాత్రి ఓ చోట మద్యం సేవించారు. అనంతరం వీరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ చోటు చేసుకున్నది. ఈ ఘర్ష ణలో ఆకాశ్ కు స్వల్పగాయాలయ్యాయి. ఇంటికి తిరిగి వచ్చిన ఆకాశ్ ముఖంపై గాయాలు చూసి అతడి తమ్ముడు, కుటుంబ సభ్యులు ఏం జరిగిందని ప్రశ్నించి, వారందరూ కలిసి దాడి చేసిన మాణిక్ ఇంటికి వెళ్లి అతడిని నిలదీశారు. ఆగ్రహంతో మళ్లీ ఇంట్లోంచి కత్తి తెచ్చి ఆకాశ్ తలపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆకాశ్ తలపై గాయమైంది. దీంతో అక్కడే ఉన్న ఆకాశ్ తమ్ముడు అరుణ్ కూడా మాణిక్ పై దాడి చేశాడు. దీంతో మాణిక్ కు సైతం గాయమైంది. ఇరువురిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరుపక్షాల వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >