Posted on 2024-01-07 18:45:57
డీజిల్ లేదని డ్రైవర్ నిర్లక్ష్య సమాధానం
డైలీ భారత్, సిరిసిల్ల :సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు చిన్న బోనాల ప్రజలు ఆఖరు ఘట్టానికి అవస్థలు పడుతున్నారు. దానికి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య పనితీరు మరింత తోడవుతుంది. వార్డుకు చెందిన ఒక వ్యక్తి గుండె నొప్పితో మరణించాడు. అయితే వార్డులో స్మశాన వాటిక లేదు. మృత దేహాన్ని మూడు కిలో మీటర్లకు పైగా వెళ్లి ఖననం చేయాలి. ఒంటి గంటకు స్థానికులు వైకుంఠ రథాన్ని పంపాలని సంబధిత మున్సిపల్ అధికారులకు తెలిపారు. సంబంధిత అధికారి డ్రైవర్ కు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నాలుగు గంటల వరకు వేచి చూసిన స్థానికులు డ్రైవర్ కు ఫోన్ చేయగా డీజిల్ లేదని నిర్లక్ష్యపు సమాధానం చెప్పాడు. దాంతో చేసేదేమీ లేక మృత దేహాన్ని మూడు కిలో మీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళి అంత్యక్రియలు చేశారు. మున్సిపల్ అధికారుల పనితీరుపై వార్డు ప్రజలు మండిపడుతున్నారు. ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వానికి స్మశాన వాటిక నిర్మించాలని ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని, కొత్త ప్రభుత్వం స్పందించి వెంటనే స్మశాన వాటిక మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజు గౌడ్ కోరారు.
కేదార్నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >