| Daily భారత్
Logo




బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కు మరణ శిక్ష.. ఐసీటీ తీర్పు

News

Posted on 2025-11-17 20:58:29

Share: Share


బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కు మరణ శిక్ష.. ఐసీటీ తీర్పు

డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్  మాజీ ప్రధాని షేక్ హసీనా ను ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్-1 (ICT-1) దోషిగా తేల్చింది. ఆమెకు మరణశిక్ష విధించింది. 2024 జూలై, ఆగస్టుల్లో జరిగిన ఆందోళనల్లో 1400 మంది మృతి చెందారని, 24,000 మంది గాయపడ్డారని ఐసీటీ న్యాయమూర్తి పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయాలని ఆమె ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన అభియోగాలపై ఐసీటీ తాజా తీర్పునిచ్చింది. తీర్పు నేపథ్యంలో ఐసీటీ చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు.

నిరసనల అణిచివేతకు హసీనా ప్రభుత్వం ఫైర్‌ఆర్మ్స్‌, హెలికాప్టర్లు సహా మారణాయుధాలను మోహరించిందని, ఫలితంగా పెద్దఎత్తున హింస చెలరేగి, మారణహోమం జరిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. హసీనాకు, దక్షిణ ఢాకా మున్సిపల్ కార్పొరేషన్‌కు మధ్య జరిగిన సంభాషణలను కూడా ఆయన చదివి వినిపించారు. ప్రజలను రజాకార్లుగా, ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్రవేసి హింసను హసీనా రెచ్చగొట్టారని, ఆమెపై అభియోగాల నిర్ధారణకు తగిన ఆధారాలున్నాయని చెప్పారు. జూలై 14న మీడియా సమావేశంలో కూడా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు.

విద్యార్థుల ఆందోళనతో పదవీచ్యుతురాలైన షేక్ హసీనా గత ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ వీడి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఒక రహస్య ప్రదేశంలో ఉంటున్నారు. తనపై తీర్పు నేపథ్యంలో కూడా... కోర్టు ఏ తీర్పునిచ్చినా తన ప్రాణం ఉన్నంతవరకూ ప్రజల కోసమే పనిచేస్తానని, దేశం కోసం తల్లిదండ్రులను పోగొట్టుకున్నానని తెలిపారు.

Image 1

ఒంటరి మహిళపై దాడి చేసి బంగారం దోపిడీ

Posted On 2026-04-13 19:14:12

Readmore >
Image 1

ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

Posted On 2026-04-13 19:09:44

Readmore >
Image 1

చలివేంద్ర కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ సమస్యలపై వినతి

Posted On 2026-04-13 17:33:33

Readmore >
Image 1

జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం

Posted On 2026-04-13 17:32:13

Readmore >
Image 1

కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం

Posted On 2026-04-13 17:30:28

Readmore >
Image 1

పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు

Posted On 2026-04-13 17:28:31

Readmore >
Image 1

వివాహిత హత్య కేసులో ప్రియుడు అరెస్ట్

Posted On 2026-04-13 16:39:06

Readmore >
Image 1

Arrive Alive అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం

Posted On 2026-04-13 16:25:36

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-13 16:20:40

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ దొంగతనం

Posted On 2026-04-13 16:18:09

Readmore >