Posted on 2025-11-18 11:31:34
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఆదాయపన్ను శాఖ భారీ స్థాయిలో దాడులు చేపట్టింది. ప్రముఖ హోటల్ వ్యాపారులకు చెందిన చైర్మన్లు, డైరెక్టర్ల ఇండ్లతో పాటు మొత్తం 15 ప్రాంతాల్లో ఐటీ అధికారులు విస్తృతంగా శోధనలు జరుపుతున్నారు. నగరంలో కోట్ల రూపాయల టర్నోవర్తో పనిచేస్తున్న ప్రముఖ హోటల్ చైన్లు పిస్తా హౌస్, షాహ్ ఘౌస్ సహా మరికొన్ని పెద్ద వ్యాపార సంస్థలు ఈ సోదాల పరిధిలోకి వచ్చాయి. ప్రతి సంవత్సరం వందల కోట్ల విలువైన వ్యాపారం జరిగే ఈ సంస్థల ఖాతాలకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదిలావుంటే, షాహ్ ఘౌస్ యజమానుల సహోదరుల ఇళ్లపై కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఇవి యాఖుత్పుర ప్రాంతంలోని రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీ దాడులపై మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >