Posted on 2025-11-22 18:44:34
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : డిసెంబర్ 8 మరియు 9 తేదీలలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్కు సంబంధించిన పనులను ఎటువంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం వేల్కుంట తాండలో డిసెంబర్ 8 మరియు 9 తేదీలలో గ్లోబల్ సమ్మిట్ జరగనున్న ప్రాంతాన్ని శనివారం కలెక్టర్ పరిశీలించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను, హెలిప్యాడ్ పనులను ఆయన పరిశీలించారు. గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన పనులను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, ఏసీపీ కె.వి. రాజు, ఎంఆర్ఓ గోపాల్, విద్యుత్ శాఖ అధికారులు, ఇతర సంబంధిత విభాగాల అధికారులు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >