Posted on 2025-12-03 15:34:32
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బుధవారం జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ ను బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జక్రాన్ పల్లి పోలీస్ సిబ్బందితో సి పి మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహణకు అన్ని ముందస్తూ ఏర్పాట్లు చేయాలని, పాత నేరస్తులను గుర్తించి బైండోవర్ చేయాలని సూచించారు. ప్రతీ పోలింగ్ స్టేషన్ ను సిబ్బంది స్వయంగా పరిశీలించి కనీస వసతులు కల్పించేవిధంగా చూడాలని, పోలీస్ స్టేషన్ రికార్డులు, బ్యారక్లు, అండర్ ఇన్వేస్టిగేషన్ కేసులపై వివులంగా తనిఖీలు చేసి ప్రతీ కేసుకి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏర్పాటు చేసి నాన్యమైన ధర్యాప్తు చేయాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, ప్రతీ ధరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసి ఫిర్యాదు దారునికి ఒక కాపీ ఇచ్చి సంతకము తీసుకోవాలని. అలానే రిజిస్టర్లో కూడా నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ రిసిప్షనిస్టుకు సూచించారు. సైబర్ క్రైమ్ అవగాహణ పాఠశాలలు, కళాశాలలలో సోషల్ మీడియా ద్వారా అవగాహణ నిర్వహించాలని, విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ప్రజలతో మమేకమై గ్రామ సమస్యలు తీర్చేవిధంగా పనిచేయాలని, సరిహద్దు ప్రాంతాల్లో పరస్పర సమన్వయం బలపర్చుకోవాలని ఆయన తెలిపారు. ట్రాఫిక్ నియత్రణకు ప్రధాన ప్రదేశాల్లో నిరంతరం నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహణ కార్యక్రమాలు నిర్వహించాలని యువతలో ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ పై అవగాహణ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సిబ్బంది ఎప్పుడు హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండేవిధంగా ఉండాలని, ప్రతీ 6 నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోవాలని, ద్విచక్రవాహణం నడిపే సమయంలో హెల్మేటు తప్పనిసరిగ్గా ధరించాలని సూచించారు. ఈ సందర్భంగా జక్రాన్ పల్లి ఎస్.ఐ జి. మహేష్ సిబ్బంది పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >