| Daily భారత్
Logo




జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

News

Posted on 2025-12-03 15:34:32

Share: Share


జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బుధవారం జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ ను బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జక్రాన్ పల్లి పోలీస్ సిబ్బందితో సి పి మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహణకు అన్ని ముందస్తూ ఏర్పాట్లు చేయాలని, పాత నేరస్తులను గుర్తించి బైండోవర్ చేయాలని సూచించారు. ప్రతీ పోలింగ్ స్టేషన్ ను సిబ్బంది స్వయంగా పరిశీలించి కనీస వసతులు కల్పించేవిధంగా చూడాలని, పోలీస్ స్టేషన్ రికార్డులు, బ్యారక్లు, అండర్ ఇన్వేస్టిగేషన్ కేసులపై వివులంగా తనిఖీలు చేసి ప్రతీ కేసుకి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏర్పాటు చేసి నాన్యమైన ధర్యాప్తు చేయాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, ప్రతీ ధరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసి ఫిర్యాదు దారునికి ఒక కాపీ ఇచ్చి సంతకము తీసుకోవాలని. అలానే రిజిస్టర్లో కూడా నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ రిసిప్షనిస్టుకు సూచించారు. సైబర్ క్రైమ్ అవగాహణ పాఠశాలలు, కళాశాలలలో సోషల్ మీడియా ద్వారా అవగాహణ నిర్వహించాలని, విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ప్రజలతో మమేకమై గ్రామ సమస్యలు తీర్చేవిధంగా పనిచేయాలని, సరిహద్దు ప్రాంతాల్లో పరస్పర సమన్వయం బలపర్చుకోవాలని ఆయన తెలిపారు. ట్రాఫిక్ నియత్రణకు ప్రధాన ప్రదేశాల్లో నిరంతరం నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహణ కార్యక్రమాలు నిర్వహించాలని యువతలో ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ పై అవగాహణ  కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సిబ్బంది ఎప్పుడు హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండేవిధంగా ఉండాలని, ప్రతీ 6 నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోవాలని, ద్విచక్రవాహణం నడిపే సమయంలో హెల్మేటు తప్పనిసరిగ్గా ధరించాలని సూచించారు. ఈ సందర్భంగా జక్రాన్ పల్లి ఎస్.ఐ జి. మహేష్ సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >