Posted on 2025-12-06 10:47:59
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:63వ హోమ్ గార్డ్సు రైసింగ్ డే కార్యక్రమం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య హాజరయ్యారు. ముందుగా హోమ్ గార్డ్స్ పరేడు కార్యక్రమం గౌరవవందనం స్వీకరించి, పరేడ్ కార్యక్రమాన్ని వీక్షించారు.
అనంతరం సిపి మాట్లాడుతూ దేశ సేవలో నిరంతరం శ్రమిస్తున్న ప్రతి హోం గార్డు సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 1946 డిసెంబర్ 6 న ముంబై లో హోమ్ గార్డ్స్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, హోంగార్డ్సు అంటే కేవలం ఒక విభాగం కాదు అది సమాజ సేవకు, శాంతి భద్రతలకు ఒక దృఢమైన మద్దతు, మన దేశ సరిహద్దులలో సైన్యంతో పాటు . మన రాష్ట్రాల లోపల పోలీసులు మరియు ఇతర విపత్తు నిర్వాహణ సంస్థలతో కలిసి చేస్తున సేవ వెలకట్టలేనిది. వీరి సేవలు శాంతి భద్రతలకు, ప్రకృతి విపత్తులకు, రవాణా మరియు ట్రాఫిక్ నిర్వాహణల " ప్రభుత్వ కార్యక్రమాల అమలులో వీరి పాత్ర అసాధారణమైనది. గతంలో ఎన్నికల బందోబస్తులు. వండుగల నిర్వహణలో, కోవిడ్-19 పరిస్థితులలో వీరి కృషి అనితరసాధ్యం, రాత్రి సమయాల్లో గస్తీ నిర్వహణ , అన్ని సందర్భాలలో ముందుండి ప్రజలను రక్షించడంలో అమోఘం అనియు, వీరు ప్రధానంగా పోలీస్ శాఖలో చక్కని విధులు నిర్వహించడం జరుగుతుందని, ప్రధానంగా శాంతి భద్రతల విషయంలో, షీ టీమ్స్ ద్వారా ఆకతాయిల ఆటకట్టడినికి, కళా బృందం ద్వారా, డ్రగ్స్ అసాంఘీక శక్తులు, మూఢనమ్మకాలను తొలగించడానికి మొదలగు పద్దతుల ద్వారా వారి సేవలు సద్వినియోగం చేసుకుంటున్నామని, వీరి కి మెడికల్ గ్రాంట్ రూ॥ 10,000/- చొప్పున 6 గురికి మంజూరు చేయబడిందని, కరోనా సమయంలో 131 మందికి రూ. 5,000/- చొప్పున ఇవ్వడం జరిగిందని, రోజువారి భత్యం 921 /- నుండి 1000/- రూపాయల వరకు పెంచబడిందని , రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సౌకర్యం, డబల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ అందించే ప్రస్తావన కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉందని, వీరి సంక్షేమ చర్యలలో భాగంగా హెచ్.డి.ఎఫ్.సి, ఆక్సిస్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో వైద్య బీమా సౌకర్యలు (రూ॥33,00,000/- వైద్య బీమా కవరేజీ ) కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అనంతరం ఈ మధ్య కాలంలో విధి నిర్వాహణలో అత్యుతమ సేవలు అందించిన 20 మంది హోమ్ గార్డ్సుకు ప్రశంసా పత్రములు అందజేశారు. వెల్నెస్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన హెల్త్ కార్డ్పు కూడా సిబ్బంది అందరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డి.సి.పి (అడ్మిన్) బస్వారెడ్డి రిజర్వు ఇన్స్పెక్టర్స్ సతీష్ (హోమ్ గార్డ్స్ ), శేఖర్ బాబు (ఎమ్.టి.ఓ), శ్రీనివాస్ (అడ్మిన్), తిరుపతి (వెల్పేర్ ). ఆర్.ఎస్.ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆడ పిల్లలను జన్మనిస్తుందనే సాకుతో భార్య ఇద్దరు పిల్లలను హత్య.... వరంగల్ పోలీస్ కమిషనర్
Posted On 2026-04-10 09:22:18
Readmore >
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్
Posted On 2026-04-10 08:29:28
Readmore >
AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి
Posted On 2026-04-10 08:06:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్
Posted On 2026-04-10 07:32:15
Readmore >
విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-10 07:25:14
Readmore >
ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
Posted On 2026-04-10 06:36:42
Readmore >