Posted on 2025-12-28 18:43:22
చంద్రంపేట మూలమలుపు వద్ద హనుమాన్ ఆలయాన్ని ఢీకొట్టిన గణేష్ బోర్వెల్ వాహనం
డైలీ భారత్, చంద్రంపేట:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేట మూలమలుపు వద్ద ఆదివారం భారీ ప్రమాదం తప్పింది. అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన "బోర్వెల్" వాహనం నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న హనుమాన్ ఆలయాన్ని బలంగా ఢీకొట్టింది. బోర్వెల్ వాహనం వేగానికి ఆలయ గోడ పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో ఆలయం వద్ద భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ఘటన జరిగినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కావడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు సాధారణంగా ఈ మూలమలుపు వద్ద నిత్యం రద్దీ ఉంటుంది. ముఖ్యంగా జీవనోపాధి కోసం ఎంతోమంది ఇక్కడ మొక్కజొన్న కంకులు అమ్ముకుంటూ ఉంటారు.
బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులు ఎప్పుడూ ఇక్కడ గుంపులుగా ఉంటారు. అయితే, ఈరోజు ఆదివారం కావడం, ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఒకవేళ రద్దీ సమయంలో ఈ ఘటన జరిగి ఉంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది అని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. ఈ మలుపు వద్ద తరచూ వాహనాలు వేగంగా వస్తూ ప్రమాదాలకు గురవుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి ఈ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అలాగే వాహనాల వేగాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >
ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు
Posted On 2026-05-02 22:26:17
Readmore >
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >