| Daily భారత్
Logo




2025లో భారత్ బలమేంటో ప్రపంచం చూసింది...మన్ కీ బాత్‍లో మోడీ

News

Posted on 2025-12-28 20:21:59

Share: Share


2025లో భారత్ బలమేంటో ప్రపంచం చూసింది...మన్ కీ బాత్‍లో మోడీ

ఇవాళ 129వ మన్ కీ బాత్ ఎడిషన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ

డైలీ భారత్ తెలంగాణ డెస్క్ : కొత్త ఆశలు, కొత్త సంకల్పంతో 2026లోకి అడుగు పెడుతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ  అన్నారు. ప్రయాగ్ రాజ్ కుంభమేళాతో ప్రారంభమైన 2025 సంవత్సరం భారతదేశం జాతీయ భద్రత, క్రీడలు, సైన్స్ వంటి ప్రతి అంశంలో ప్రపంచంలోని అతిపెద్ద వేదికల్లో బలమైన ముద్ర వేసిందన్నారు.

మన్ కీ బాత్ ఎడిషన్ కార్యక్రమంలో  దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. 2025 సంవత్సరంలోని అంశాలను గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది ప్రతి భారతీయుడికి గర్వకారణంగా మారడానికి ఎన్నో క్షణాలను ఇచ్చిందని ఆపరేషన్ సిందూర్ మారుతున్న భారతావనిగా అభివర్ణించిన మోడీ.. సైనిక విజయాన్ని దేశవ్యాప్త దేశభక్తిని పెంచిన ఘటనగా ప్రశంసించారు. ఈ ఆపరేషన్ ఈ ఏడాది ప్రతి భారతీయుడికి గర్వకారణంగా మారిందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‍తో నేటి భారతదేశం తన భద్రత విషయంలో రాజీపడదని ప్రపంచం స్పష్టంగా చూస్తుందని చెప్పారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజలు అదే స్ఫూర్తిని మరియు ఉత్సాహాన్ని చూపించినందుకు మోడీ అభినందించారు.

వికసిత్ భారత్ ద్వారా దేశం అన్ని విభాగాల్లో ముందుకెళ్తోందని మోడీ చెప్పారు. రెండో యంగ్ ఇండియా లీడర్ సదస్సు జనవరి 12న జరగనుందని ఇందులో వివిధ ప్రాంతాల యువత తమ ఆలోచనలు పంచుకుంటారని చెప్పారు. యంగ్ ఇండియా లీడర్ సదస్సులో నేనూ తప్పనిసరిగా పాల్గొంటానని చెప్పారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ లో విద్యార్థులు 70 అంశాలపై ప్రతిభ చూపారని స్మార్ట్ ట్రాఫిక్, సైబర్ సెక్యూరిటీపై ఆవిష్కరణలు ప్రదర్శించారన్నారు. 2025 క్రీడల పరంగా కూడా చిరస్మరణీయమైన సంవత్సరం అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారత పురుషుల క్రికెట్ జట్టు ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంటే మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. మహిళల అంధుల T20 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం ద్వారా భారత కుమార్తెలు చరిత్ర సృష్టించారని మోడీ ప్రశంసించారు. ఆసియా కప్ T20లో త్రివర్ణ పతాకం కూడా గర్వంతో రెపరెపలాడిందని ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అనేక పతకాలు గెలుచుకున్నందుకు పారా-అథ్లెట్లను కూడా ఆయన ప్రశంసించారు. గతేడాది వారణాసిలో కాశీ-తమిళ సంగమం జరుపుకున్నాం.వారణాసిలోని పిల్లలు తమిళం మాట్లాడుతున్నారు. మాతృభాష హిందీ అయినప్పటికీ తమిళం నేర్చుకుని మాట్లాడుతున్నారన్నారు. దేశంలో చిరుతల సంఖ్య 30 దాటిందని గుర్తు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, మహిళా సాధికారత, వోకల్ ఫర్ లోకల్ దేశీయ ఉత్పుత్తుల ప్రోత్సాహం వంటి అంశాలను మోడీ ప్రస్తావించారు.

Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >