Posted on 2025-12-30 08:53:40
డైలీ భారత్ స్పెషల్: అమృతం
ప్రియతమ నాయకుడి
విగ్రహాలకు పాలాభిషేకాలంట
దొంగ స్వాముల పాదములకు
పాలాభిషేకాలంట
పాల్లేక ఆకలితో అలమటించే
శిశువుల రోదనలు మరిచిపోయినారా
ఆకలితో అలమటిస్తు కాటికి కాలు చాపిన
వృద్ధ రోగులను మరిచిపోయినారా
ఆయువు నిలబట్టాల్సిన క్షీరం
ఆవిరై పోతుంటె గోమాత
పడిన బాధ మరిచిపోయినారా
లేగదూడల కడుపు కొట్టి
పితికిన పాలను హీరో పోస్టర్లకి
అభిషేకాలు చేస్తూ
దూడల అరుపులు మరిచిపోయినారా
ఎంతోమంది ప్రాణాలు కాపాడే
అమృతాన్ని వృధా కాకుండా
చూడాలని కోరుకుంటూ
మీ
మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణా రాష్ట్రం
చరవాణి 9347042218
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >