Posted on 2025-12-30 16:40:25
డైలీ భారత్, మట్టపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మహాక్షేత్రం నందు వైకుంఠ ఏకాదశి మహా పర్వదిన సందర్భంగా మంగళవారం స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం అనంతరం రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మీ సమేతంగా స్వామి వారిని గ్రామ పుర వీధులలో గరుడ వాహనంపై ఊరేగిస్తు గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మ కర్తలు చెన్నూరు మట్టపల్లి రావు, చెన్నూరు విజయ్ కుమార్, కార్య నిర్వహణాధికారి జ్యోతి, గ్రామ సర్పంచ్ రామిశెట్టి విజయశాంతి అప్పారావు, ఆలయ వంశ్యపారంపర్య అర్చకులు తూమాటి శ్రీనివాసా చార్యులు, తూమాటి కృష్ణమా చార్యులు, తూమాటి రామాచార్యులు, అద్దేపల్లి ఫణి భూషణ్ మంగా చార్యులు, ప్రసన్న కుమార్ గ్రామపెద్దలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >