| Daily భారత్
Logo




సిరిసిల్ల శాంతినగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దుస్థితిపై బీజేపీ తీవ్ర ఆందోళన

News

Posted on 2025-12-30 16:55:02

Share: Share


సిరిసిల్ల శాంతినగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దుస్థితిపై బీజేపీ తీవ్ర ఆందోళన

డైలీ భారత్, సిరిసిల్ల:సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుని, పిచ్చిమొక్కలతో నిండిపోయి ఉండటం అత్యంత దురదృష్టకరమని దుమాల శ్రీకాంత్, పట్టణ అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ, సిరిసిల్ల పట్టణ శాఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఇళ్లను స్వయంగా పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ – ప్రజల కోసం నిర్మించిన ఇళ్లు ఇలా నిర్లక్ష్యానికి గురవడం ప్రజాధనానికి ఘోరమైన అవమానమని అన్నారు. ఖాళీగా ఉన్న ఇళ్లలో ఎలక్ట్రికల్ వైర్లు, మోటార్లు, ఐరన్ సామాగ్రి దొంగలపాలవుతుండగా, ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

 సిరిసిల్ల పట్టణ శివారులో అత్యంత ఖరీదైన స్థలంలో ఇట్టి డబుల్ బెడ్ రూమ్ ఇలడ్లు నిర్మాణం జరిగినవి అంతకుముందు ఇదే స్థలంలో గౌరవ ఎస్సీ కులస్తులకు కాలనీ నిర్మించి అది కూడా శిథిలావస్థకు చేరగా వాటి స్థానంలో ఈ డబల్ బెడ్ రూమ్ ఇడ్లు నిర్మించారు ఇప్పుడు ఇవి కూడా వాటిలాగే సితిలావస్థకు చేరే పరిస్థితి.


గతంలో ఈ ఇళ్లను మొదటగా గౌరవ ఎస్సీ కులస్తులకు కేటాయించిన తర్వాత మిగతా అర్హులకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని ఆయన పేర్కొన్నారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని డిమాండ్ చేశారు.

అప్పటి మంత్రి, ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే  అప్పుడు డబల్ బెడ్ రూమ్లు పంపిణీ చేయగా ఇంకా 900 మంది మిగిలిన వారు ఉన్నారు అందులో నుండి కొంతమంది కి పట్టాలు ఇచ్చారు కనీసం వారికి స్థలం కూడా చూపించలేదని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలను విస్మరించి కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితమవడం బాధాకరమని మండిపడ్డారు.

కిరాయిలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని, లేనిపక్షంలో ఇవి పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఈ విషయంలో జిల్లా కలెక్టర్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని, అర్హులైన నిరుపేదలకు ఇళ్లను వెంటనే కేటాయించాలని బీజేపీ సిరిసిల్ల పట్టణ శాఖ తరపున డిమాండ్ చేస్తున్నామని దుమాల శ్రీకాంత్  స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్, మెరుగు శ్రీనివాస్, మోర రవి, నరసయ్య, దూడం సురేష్, గాని శ్రీనివాస్, కంబోజి శ్రీధర్, అంకారపు రాజు వర్ణాల శేఖర్ బాబు అభి కనుకయ్య దేవరాజు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >