| Daily భారత్
Logo




సిరిసిల్ల శాంతినగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దుస్థితిపై బీజేపీ తీవ్ర ఆందోళన

News

Posted on 2025-12-30 16:55:02

Share: Share


సిరిసిల్ల శాంతినగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దుస్థితిపై బీజేపీ తీవ్ర ఆందోళన

డైలీ భారత్, సిరిసిల్ల:సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుని, పిచ్చిమొక్కలతో నిండిపోయి ఉండటం అత్యంత దురదృష్టకరమని దుమాల శ్రీకాంత్, పట్టణ అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ, సిరిసిల్ల పట్టణ శాఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఇళ్లను స్వయంగా పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ – ప్రజల కోసం నిర్మించిన ఇళ్లు ఇలా నిర్లక్ష్యానికి గురవడం ప్రజాధనానికి ఘోరమైన అవమానమని అన్నారు. ఖాళీగా ఉన్న ఇళ్లలో ఎలక్ట్రికల్ వైర్లు, మోటార్లు, ఐరన్ సామాగ్రి దొంగలపాలవుతుండగా, ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

 సిరిసిల్ల పట్టణ శివారులో అత్యంత ఖరీదైన స్థలంలో ఇట్టి డబుల్ బెడ్ రూమ్ ఇలడ్లు నిర్మాణం జరిగినవి అంతకుముందు ఇదే స్థలంలో గౌరవ ఎస్సీ కులస్తులకు కాలనీ నిర్మించి అది కూడా శిథిలావస్థకు చేరగా వాటి స్థానంలో ఈ డబల్ బెడ్ రూమ్ ఇడ్లు నిర్మించారు ఇప్పుడు ఇవి కూడా వాటిలాగే సితిలావస్థకు చేరే పరిస్థితి.


గతంలో ఈ ఇళ్లను మొదటగా గౌరవ ఎస్సీ కులస్తులకు కేటాయించిన తర్వాత మిగతా అర్హులకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని ఆయన పేర్కొన్నారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని డిమాండ్ చేశారు.

అప్పటి మంత్రి, ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే  అప్పుడు డబల్ బెడ్ రూమ్లు పంపిణీ చేయగా ఇంకా 900 మంది మిగిలిన వారు ఉన్నారు అందులో నుండి కొంతమంది కి పట్టాలు ఇచ్చారు కనీసం వారికి స్థలం కూడా చూపించలేదని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలను విస్మరించి కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితమవడం బాధాకరమని మండిపడ్డారు.

కిరాయిలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని, లేనిపక్షంలో ఇవి పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఈ విషయంలో జిల్లా కలెక్టర్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని, అర్హులైన నిరుపేదలకు ఇళ్లను వెంటనే కేటాయించాలని బీజేపీ సిరిసిల్ల పట్టణ శాఖ తరపున డిమాండ్ చేస్తున్నామని దుమాల శ్రీకాంత్  స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్, మెరుగు శ్రీనివాస్, మోర రవి, నరసయ్య, దూడం సురేష్, గాని శ్రీనివాస్, కంబోజి శ్రీధర్, అంకారపు రాజు వర్ణాల శేఖర్ బాబు అభి కనుకయ్య దేవరాజు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Image 1

బయటపడ్డ నకిలీ రిజిస్ట్రేషన్ ద్వారా భూకబ్జా మోసం

Posted On 2026-05-04 08:54:09

Readmore >
Image 1

బంగారం చోరీ కేసును చేధించిన పోలిసులు

Posted On 2026-05-03 20:42:05

Readmore >
Image 1

స్మశాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం

Posted On 2026-05-03 18:13:51

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-05-03 18:11:11

Readmore >
Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >
Image 1

మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-05-02 23:48:08

Readmore >