| Daily భారత్
Logo




భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

News

Posted on 2025-12-31 17:18:48

Share: Share


భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

సిపి సాయి చైతన్య కు వినతిపత్రం అందజేసిన గ్రామస్తులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:గ్రామానికి చెందిన భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని 18 డివిజన్ కార్పొరేటర్, స్థానిక ప్రజలు మాజీ కార్పొరేటర్ యమునా అనిల్ కోరారు. బుధవారం 

పోలీస్ కమిషనర్ సీపీ సాయి చైతన్య, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ కు వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు. సోమవారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి లకు వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు అనిల్, రవి, శ్రీనివాస్, మోహన్, మల్లేష్ మాట్లాడుతూ.. 18వ డివిజన్ ముబారక్ నగర్ కు చెందిన 45 ఎకరాల భూమిని ఏకశిల వెంచర్స్ 1990 లో అమ్మగా అందులో నుంచి  10 శాతం గ్రామం కోసం భూమిని వదిలి వేయడం జరిగిందన్నారు.

 ఆ 10 శాతం రెండెకరాల 20 గుంటల భూమిని ప్రస్తుతం కబ్జా చేసి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. అక్కడ గ్రామానికి చెందిన పశువుల తొట్టి, బోరుబావి తీసివేసి, గ్రామం కోసం వదిలేసిన స్థలములో ప్లాట్లు వేసి అమ్మాలని చూస్తున్నారని అన్నారు. ఈ విషయం గ్రామానికి చెందిన 18 డివిజన్ సభ్యులను వెళ్లి అడగగా, ఇది మా స్థలం, మేము ఏమైనా చేస్తాము అని మాపై దౌర్జన్యం చేయడం జరిగింది అన్నారు. అక్కడ ఫ్లాట్లు కొన్న చాలామంది పార్కు ఉంటుందని ఉద్దేశంతో కొనడం జరిగిందని, అందరిని మభ్యపెట్టి ఆ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కమిషనర్ ను కలిసిన వారిలో శ్రీనివాస్, రవి, చిన్న మల్లేష్, ఆనంద్, సందీప్, అభిలాష్, ప్రసాద్, పెరిక సుమన్, క్యతం గంగాధర్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.


Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >