| Daily భారత్
Logo




భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

News

Posted on 2025-12-31 17:18:48

Share: Share


భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

సిపి సాయి చైతన్య కు వినతిపత్రం అందజేసిన గ్రామస్తులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:గ్రామానికి చెందిన భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని 18 డివిజన్ కార్పొరేటర్, స్థానిక ప్రజలు మాజీ కార్పొరేటర్ యమునా అనిల్ కోరారు. బుధవారం 

పోలీస్ కమిషనర్ సీపీ సాయి చైతన్య, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ కు వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు. సోమవారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి లకు వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు అనిల్, రవి, శ్రీనివాస్, మోహన్, మల్లేష్ మాట్లాడుతూ.. 18వ డివిజన్ ముబారక్ నగర్ కు చెందిన 45 ఎకరాల భూమిని ఏకశిల వెంచర్స్ 1990 లో అమ్మగా అందులో నుంచి  10 శాతం గ్రామం కోసం భూమిని వదిలి వేయడం జరిగిందన్నారు.

 ఆ 10 శాతం రెండెకరాల 20 గుంటల భూమిని ప్రస్తుతం కబ్జా చేసి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. అక్కడ గ్రామానికి చెందిన పశువుల తొట్టి, బోరుబావి తీసివేసి, గ్రామం కోసం వదిలేసిన స్థలములో ప్లాట్లు వేసి అమ్మాలని చూస్తున్నారని అన్నారు. ఈ విషయం గ్రామానికి చెందిన 18 డివిజన్ సభ్యులను వెళ్లి అడగగా, ఇది మా స్థలం, మేము ఏమైనా చేస్తాము అని మాపై దౌర్జన్యం చేయడం జరిగింది అన్నారు. అక్కడ ఫ్లాట్లు కొన్న చాలామంది పార్కు ఉంటుందని ఉద్దేశంతో కొనడం జరిగిందని, అందరిని మభ్యపెట్టి ఆ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కమిషనర్ ను కలిసిన వారిలో శ్రీనివాస్, రవి, చిన్న మల్లేష్, ఆనంద్, సందీప్, అభిలాష్, ప్రసాద్, పెరిక సుమన్, క్యతం గంగాధర్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.


Image 1

కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు

Posted On 2026-05-04 20:10:55

Readmore >
Image 1

దమ్మపేట బిజెపి శ్రేణుల సంబరాలు

Posted On 2026-05-04 19:56:57

Readmore >
Image 1

సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-04 19:51:36

Readmore >
Image 1

కామారెడ్డి డిఎస్పిగా యస్. మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

Posted On 2026-05-04 19:01:07

Readmore >
Image 1

హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..

Posted On 2026-05-04 18:53:54

Readmore >
Image 1

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, 5000 రూపాయల జరిమానా

Posted On 2026-05-04 18:51:37

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు

Posted On 2026-05-04 18:49:53

Readmore >
Image 1

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

Posted On 2026-05-04 18:24:03

Readmore >
Image 1

నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ఎనిమిది వ్యక్తులు అరెస్టు

Posted On 2026-05-04 18:00:43

Readmore >
Image 1

నేలల సంరక్షణ.. ఎరువుల వినియోగం కీలకం

Posted On 2026-05-04 15:44:15

Readmore >